తండ్రి కోసం స్వ‌యంగా కేక్ త‌యారు చేసిన బుట్ట‌బొమ్మ‌


లాక్‌డౌన్ వ‌ల‌న అన్ని దుకాణాలు మూసేశారు. బేక‌రీలు కూడా బంద్ కావ‌డంతో కేక్‌లు దొర‌క‌ని ప‌రిస్థితులు నెల‌కొంది. బ‌ర్త్‌డేల‌కి ,పెళ్ళి రోజుల‌లో కంప‌ల్స‌రీ కేక్ క‌ట్ చేసి బ‌ర్త్‌డే జ‌రుపుకునే ప్ర‌జ‌లు ఈ సారి కేకులు దొర‌క‌క‌పోవ‌డంతో ఇంట్లోనే స్పెష‌ల్‌గా కేకులు త‌యారు చేసుకొని పార్టీస్ జ‌రుపుకుంటున్నారు. 


తాజాగా బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే త‌న తండ్రి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా చాక్లెట్ కేక్ త‌యారు చేసింది. శ‌నివారం బ‌ర్త్‌డే కావ‌డంతో నిన్న రాత్రే  త‌న తండ్రితో క‌ట్ చేయించింది. వాటికి సంబంధించిన ఫోటోల‌ని సోష‌ల్ మీడియాలో  షేర్ చేసింది. పూజా త‌యారు చేసిన కేక్‌ని చూసి నెటిజ‌న్స్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇటీవ‌ల అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన పూజా ప్ర‌స్తుతం ప్ర‌భాస్ స‌ర‌స‌న ఓ డియ‌ర్ అనే చిత్రం చేస్తుంది. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందుతుంది


 




 

Popular posts