లాక్డౌన్ వలన నిరాశ్రయులైన పేద సినీ కార్మికులని ఆదుకునేందుకు టాలీవుడ్ సినీ పరిశ్రమ చిరంజీవి నేతృత్వలో కరోనా క్రైసిస్ ఛారిటీ మనకోసంని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సంస్థకి బడా హీరోలు, నిర్మాతలు, టెక్నీషియన్స్, దర్శకులు, సింగర్స్ ఇలా పలువురు ప్రముఖులు విరాళాలు అందిస్తూ వస్తున్నారు. తాజాగా సి సి సి కి మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ తరపున ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ రూ.5 లక్షల విరాళం అందించారు.
ఇక నిర్మాత మోహన్ చెరుకూరి కరోనా క్రైసిస్ ఛారిటీకి రూ. 5లక్షల విరాళం అందించనున్నట్టు పేర్కొన్నారు.ఇలాంటి పరిస్థితులలో రోజువారీ కూలీ కార్మికులకు మద్దతుగా మొత్తం చిత్ర పరిశ్రమ నిలబడి ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా పేర్కొన్నారు.